లండన్‌లో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..

86
- Advertisement -

టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎన్నారై టిఆర్‌ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్‌లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఘనంగా నిర్వహించుకున్నారు. ఎన్నారై టి.ఆర్.ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి దాదాపు 200 లకు పైగా ఎన్నారై తెరాస మరియు ఇతర ప్రవాస కుటుంబసభ్యులు హాజరయ్యారు.

సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండే విధంగా అన్ని మతాల దేవుళ్ళు ఆశీర్వదించాలని ముందుగా హిందూ, ముస్లిం మరియు క్రైస్తవ మత ప్రతినిధులతో సర్వమత ప్రార్థన నిర్వహించారు. వారంతా పూజలు, ప్రార్థనలు చేసి కేసీఆర్ గారికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని, రాష్ట్రాన్నే కాదు రాబోయే రోజుల్లో దేశాన్నే నడిపించే శక్తిని ఇవ్వాలని ప్రార్థించి ఆశీర్వచనం అందించారు. హాజరైన అతిథులంతా కూడా ఈ ప్రార్థనలల్లో పాల్గొన్నారు.

ఎన్నారై టి.ఆర్.ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ.. ఉద్యమ నాయకుడే మన పాలకుడై నేడు సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపారని, ఇలాంటి నాయకుడు మనకు ఉండడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టమని, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అందుతున్న సంక్షేమ పథకాల్ని నేడు దేశమంతా అనుసరిస్తుందని, ఇక రాబోయే రోజుల్లో మన కేసీఆర్ గారు దేశానికి నాయకత్వం వహించాలని దేశం ఎదురుచూస్తుందని, ఎలాగైతే ఉద్యమ సమయం నుండి నేటి వరకు వారి వెంట ఉన్నామో, భవిష్యత్తులో కూడా వారి నిర్ణయం ఏదైనా వారి వెంటే ఉంటామని అశోక్ తెలిపారు.

కేసీఆర్ గారి నాయకత్వమే మనకు శ్రీరామ రక్షని, సందర్భం ఏదైనా వారి నాయకత్వాన్ని బలపరచాలని తెలంగాణ సమాజాన్ని అశోక్ కోరారు. కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చెయ్యాలని , దేవుడి ఆశీస్సులు ఎల్లపుడూ వారికి ఉండాలని అశోక్ ప్రార్థించారు.ఖండాంతరాల్లో ఉంటూ తెరాస జెండా మోసే అవకాశం కలిపించిన టి.ఆర్.ఉస్ అధ్యక్షుడు కేసీఆర్ గారికి అన్ని సందర్భాల్లో మా వెంటే ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి మరియు ఇతర నాయకులందరికీ అశోక్ కృతఙ్ఞతలు తెలిపారు.

దాదాపు పదకొండు సంవత్సరాలుగా లండన్‌లో కేసీఆర్ గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, నాడు లండన్ లో మాత్రమే నిర్వహించే వేడుకలు నేడు ప్రపంచమంతా జరుగుతున్నాయని, మాకెంతో గర్వంగా ఉందని, నిర్వాహుకులందరికీ, ప్రపంచవ్యాప్త ఎన్నారై తెరాస ప్రతినిధులకు అశోక్ కృతఙ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని హాజరై వియజవంతం చేసిన ఎన్నారై తెరాస నాయకులకు, కుటుంబసభ్యులకు, ఇతర సంస్థల ప్రతినిధులకు, ప్రవాసులు కృతఙ్ఞతలు తెలిపారు.

తాను ఎక్కడున్నా మాకు అన్ని రకాల సూచనల్ని సలహాలనిస్తూ ఎన్నారైలకే స్ఫూర్తిగా నిలుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ఎన్నారై తెరాస వ్య్వవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంకి అశోక్ ప్రత్యేక కృతఙతలు తెలిపారు. ఎన్నారై తెరాస కుటుంబ సభ్యులంతా కేక్ కట్ చేసి కేసీఆర్ గారి 68 వ జన్మదిన వేడుకల్ని జరుపుకొని, హ్యాపీ బర్త్‌డే కేసీఆర్ సార్ , దేశ్ కా నేతా కేసీఆర్.. మేమంతా మీ వెంటే అంటూ నినదించారు. ప్రవాసులంతా కేసీఆర్ గారి జన్మదిన విందు భోజనాన్ని ఆనందించి నిర్వాహకులను అభినందించారు.

ఎన్నారై తెరాస యూకే ప్రధాన కార్యదర్శి మరియు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ.. నేడు సర్వమత ప్రార్థనలు చేసి కేసీఆర్ గారిని ఆశీర్వదించిన అన్ని మతాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపి, మేమంతా కేవలం వేడుకలకే పరిమితం కాలేదని, తెలంగాణ రాష్ట్రంలో పలు సేవా కార్యక్రామాలు కూడా నిర్వహిస్తున్నామని రత్నాకర్ తెలిపారు.

ఎన్నారై తెరాస యూకే నాయకులు అబుజాఫర్ ప్రత్యేక ప్రార్థనలు చేసి కేసీఆర్ గారు బాగుండాలని అల్లాని ప్రార్థించానని, అన్ని మతాల ప్రజల ఆశీస్సులు కేసీఆర్ గారికి ఉన్నాయని, నేడు కేసీఆర్ గారి వల్లే తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు అన్ని రకాలుగా అభివృద్ధి చెంది సంతోషంగా ఉన్నారని అబుజాఫర్ తెలిపారు. హైదరాబాద్ కు చెందిన స్థానిక “ఎల్స్ట్రీ బోరెంహూడ్ ” కౌన్సిలర్ ప్రభాకర్ ఖాజా వేడుకలకు హాజరై కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, వేడుకల్ని ఘనంగా నిర్వహించినందుకు అశోక్ బృందాన్ని అభినందించారు. ఎన్నారై తెరాస యూకే ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టి.ఆర్‌.ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, ఎన్నారై టి.ఆర్‌.ఎస్ యూకే ప్రధాన కార్యదర్శి మరియు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, స్థానిక “ఎల్స్ట్రీ బోరెంహూడ్ ” కౌన్సిలర్ ప్రభాకర్ ఖాజా, ఎన్నారై తెరాస నాయకులు నవీన్ రెడ్డి, సత్యమూర్తి చిలుముల, హరి గౌడ్ నవాపేట్, మల్లా రెడ్డి, సేరు సంజయ్, వెంకట్ రెడ్డి, శ్రీధర్ రావు తక్కళ్లపల్లి, సత్యం రెడ్డి కంది, వీర ప్రవీణ్ కుమార్, అబుజాఫర్, నవీన్ భువనగిరి, రవి ప్రదీప్ పులుసు, రవి రేతినేని, సురేష్ బుడగం, శ్రీకాంత్ జెల్ల, సృజన్ రెడ్డి చాడా, సత్యపాల్ పింగళి, రమేష్ ఎసెంపల్లి, మధు రెడ్డి, గణేష్ పస్తం, పృథ్వీ రావుల మరియు ప్రవాస సంఘాల నాయకులు పవిత్రా రెడ్డి, శుష్మునా రెడ్డి, స్వాతి, మాధవ్, శ్రీకాంత్ ముదిరాజ్, జాహ్నవి, సుప్రజ, క్రాంతి, శైలజ, నంతిని, విద్య, అపర్ణ, పావని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -