ఐటీ పార్కుకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్‌..

124
- Advertisement -

హైదరాబాద్‌లోని కండ్లకోయలో తెలంగాణ గేట్ వే పేరుతో నిర్మిస్తున్న ఐటీ పార్కుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా పార్కు పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ఐటీ పార్కును 10.11 ఎకరాలల్లో 40 మీటర్ల ఎత్తు, 14 అంతస్తులతో నిర్మిస్తున్నారు.

6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండనున్న ఈ ఐటీ టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.250 కోట్లు ఖర్చు చేయనుంది. దీంతో 5 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి రానుంది. ఐటీ పార్కులో 70 కంపెనీల ద్వారా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద‌, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజుతో పాటు ప‌లువురు టీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు.

- Advertisement -