వైష్ణవ్‌ తేజ్‌..హీరోగా రాణించాలి:చిరు

243
chiru
- Advertisement -

మెగా కుటుంబం నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కానున్నారు. హీరో సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్ హీరోగా సినిమా ప్రారంభమైంది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి మంచి టాలెంట్ ఉన్న బుచ్చిబాబు ఈ కథతో అందరిని ఆకట్టుకుంటాడు.. మనసు పెట్టి రాసిన కథ.. తాను మాత్రమే ఎదగాలని కాకుండా తనతో పాటు ఇతరులు ఎదగాలని సుకుమార్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు.

vaishnav tejవీరికి సుకుమార్ కలిసి వైష్ణవ్ తేజ్ తో ఓ మంచి సినిమా ను తీయబోతున్నారు.ఇంతచక్కటి అవకాశం ప్రారంభంలోనే లభించడం అదృష్టం. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఆకాంక్షిస్తున్నాన్నారు.బుచ్చి బాబు చాల కొత్త కథ రాశాడని తెలిపారు.

మైత్రి మూవీస్ సంస్థ సాధించిన విజయాల గురించి అందరికి తెలిసిందే..రామ్ చరణ్ తో చేసిన ‘రంగస్థలం’ సినిమా తో ఈ సంస్థకు, సుకుమార్ గారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది..మంచి మనసున్న వ్యక్తులు ఈ సంస్థ నిర్మాతలు అని కొనియాడారు చిరు.

chiru chiru

- Advertisement -