వారి విజ్ఞతకే వదిలేస్తున్నా:కేటీఆర్

223
ktr twitter
- Advertisement -

నేటి నుండి ఐదు రోజుల పాటు సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సహస్ర మహాచండీయాగం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంగ్లీష్ మీడియా ప్రచురించిన వార్తపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలంటించారు.

కొన్ని మీడియా సంస్థలు నిజనిజాలు తెలుసుకోకుండా, కామన్ సెన్స్ లేకుండా వార్తలను పబ్లిష్ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వార్తలను పబ్లిష్ చేయడం పట్ల సంబంధిత ఎడిటర్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లోక్ సభ ఎన్నికల్లో విజయం కోసం, ప్రధాని కావాలనే లక్ష్యంతోనే నేటి నుంచి ఐదు రోజుల పాటు సహస్ర మహా చండీయాగం చేస్తున్నారని ఓ ఇంగ్లీష్ మీడియా వార్త ప్రచురించింది. ఈ వార్తను హర్షవర్ధన్ అనే వ్యక్తి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై కేటీఆర్ స్పందిస్తూ సంబంధిత పత్రికకు ఘాటు సమాధానం తెలిపారు.

https://twitter.com/KTRTRS/status/1087233120099807233

- Advertisement -