‘ఆచార్య’ విడుద‌లకు ముహుర్తం ఖరారు..

81
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి దర్శకుడు కొరటాల శివ కాంబోలో రాబోతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా కొత్త విడుద‌ల తేదీని చిత్రం బృందం ప్ర‌క‌టించింది. ఏప్రిల్ 1 ఆచార్య సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని తెలిపారు. సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న‌ కుమారుడు రామ్ చరణ్ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. చిరంజీవి స‌ర‌స‌న‌ కాజల్ అగర్వాల్, చరణ్ స‌ర‌స‌న‌ పూజా హెగ్డే నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుద‌లైన ప‌లు పాట‌లకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది.

- Advertisement -