ప్రపంచంలోనే ఎత్తైన వంతెన ను నిర్మిస్తోంది చైనా. త్వరలోనే ఈ బ్రిడ్జి ప్రారంభంకానుండగా ఇది అందుబాటులోకి వస్తే గంట ప్రయాణం ఒక నిమిషంలో పూర్తి కానుంది. జూన్లో ప్రారంభమయ్యే హుజియాంగ్ గ్రాండ్ క్యానియన్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా నిలవనుంది.
ఈ వంతెన నిర్మాణం కోసం రూ.2200 కోట్లు (216 మిలియన్ పౌండ్లు) ఖర్చయ్యింది. ఇది ఐఫిల్ టవర్ కంటే 200 మీటర్ల ఎత్తుగా ఉండి, దానికంటే మూడింతల బరువు కలిగి ఉంది. ఈ వంతెన రెండు మైళ్ళ పొడవున ఒక పెద్ద గుండ్రంలో (గ్రాండ్ క్యానియన్) విస్తరించి ఉండటం విశేషం. దీనివల్ల ఇప్పటివరకు గంట సమయం పడుతున్న ప్రయాణం కేవలం ఒక నిమిషంలో పూర్తి చేయవచ్చు.
ఈ వంతెన ద్వారా గ్రామీణ ప్రాంతాలకు రవాణా మార్గం మెరుగపర్చడమే కాదు పర్యాటక ప్రాంతంగా కూడా మారనుందని ఆ దేశ అధికారులు తెలిపారు. ఈ వంతెన దాదాపుగా మొత్తం భాగం పెద్ద లోయ పైకి వేలాడుతూ నిర్మించబడినదే కావడం దీని విశిష్టత.
China’s Huajiang Grand Canyon Bridge is set to open this year, becoming the world’s tallest bridge at 2050 feet high.
Recent footage of the bridge has been released, showing crews putting on the finishing touches.
One of the most insane facts about the bridge is that… pic.twitter.com/DLWuEV2sXQ
— Collin Rugg (@CollinRugg) April 8, 2025
Also Read:విజయశాంతి దంపతులకు బెదరింపులు

