సీఎం కేసీఆర్‌ని కలిసిన చెన్నమనేని

21
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా (వ్యవసాయ రంగ వ్యవహారాలు) తనను నియమించినందుకు వేములవాడ శాసనసభ్యులు డా. చెన్నమనేని రమేశ్ బాబు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని బుధవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రమేశ్ బాబు మాట్లాడుతూ… వ్యవసాయ రంగంలో నెలకొన్న ఆరు దశాబ్దాల వ్యవసాయ సంక్షోభాన్ని, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, కేవలం దశాబ్ధికాలంలోపే అధిగమించిందని తెలిపారు.

సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ రాష్ట్రం నేడు వ్యవసాయ విధానాల అమలు, వ్యవసాయాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని రమేశ్ బాబు తెలిపారు. సీఎం గారి సారథ్యంలో వ్యవసాయ అభివృద్ధి, రెండవ దశలో భవిష్యత్తు సవాళ్లకు సిద్దమౌతున్న సమయంలో సీఎం కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఎమ్మెల్యే రమేశ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చెన్నమనేని రమేశ్ బాబుకి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు.
Also Read:ప్రభాస్ సినిమాలో రాజమౌళి!

- Advertisement -