IPL 2023:ముంబైని చిత్తు చేసిన చెన్నై

44
- Advertisement -

ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నై రెండో విజయాన్ని నమోదుచేసింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబై విధించిన 158 పరుగుల టార్గెట్‌ని 18.1 ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయింది. ఓపెనర్ రహానె 27 బంతుల్లో 7 ఫోర్లు,3 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్..36 బంతుల్లో 40 పరుగులు), శివమ్ దూబే(28), అంబటి రాయుడు(16) రాణించారు. ముఖ్యంగా రహానే ఒకే ఓవర్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. తుశార్ దేశ్ పాండే, మిచెల్ సాంట్నర్ తలో రెండు వికెట్లు తీశారు. మగళ ఒక వికెట్ తీశాడు. ఈ సీజన్ లో చెన్నైకి ఇది వరుసగా రెండో విజయం కాగా, ముంబైకి వరుసగా రెండో పరాజయం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -