CM KCR:12న ఇఫ్తార్‌ విందు

59
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 12న సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇస్తున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు.

పేద ముస్లింలకు రంజాన్‌ తోఫా అందజేస్తారు. ఇదిలా ఉండగా గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మంది నిరుపేద ముస్లింలకు గిఫ్ట్‌ ప్యాక్‌ లు పంపిణీ చేయనున్నారు. ఒక్కో కమిటీకి 500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 815 మసీదు మేనేజింగ్‌ కమిటీలకు ఇప్పటికే గిఫ్ట్‌ ప్యాకెట్లను సరఫరా చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -