జీడీ నాయుడిగా మ్యాడీ…!

58
- Advertisement -

విభిన్న పాత్రలతో, విలక్షణమైన నటనతో ప్రేక్షకుల గుండెల్ని తట్టే సినిమాలను తీసే నటుడు ఆర్. మాధవన్‌.  నంబినారాయణ్‌ జీవితాధారంగా తెరకెక్కిన సినిమా రాకెట్రీ. ఈ బయోపిక్‌ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయితే తాజాగా మరోసారి బయోపిక్ లో నటిస్తున్నారని కోలీవుడ్‌లో టాక్.

జీడీ. నాయుడు అనే ఎడిసన్‌ ఆఫ్ ఇండియాగా పిలిచే జీడీ నాయుడు జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమాలో కీలకపాత్రలో పోషించనున్నారు. మిరాకిల్ మ్యాన్ కోయంబత్తూరులో సంపదను సృష్టించిన వ్యక్తిగా అభివర్ణించే వ్యక్తి జీవితం అధారంగా నిర్మిస్తున్నారు. ఈయనే ఇండియాలో మొదట ఎలక్ట్రిక్ మోటార్‌ను రూపొందించారు. మీడియా వన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మాధవన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ కామెడీ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో మంజు వారియర్ ఆయనకు జోడీగా నటిస్తున్నారు. కపిల్ గార్గ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 50శాతం పూర్తయింది. ఈ సినిమాలో మ్యాడీ భారత్‌లో జన్మించిన అమెరికన్ సైకాలజీ ప్రొఫెసర్‌గా నటిస్తున్నారు. మంజు వారియర్ భోపాల్‌కు చెందిన న్యాయవాది పాత్రను పోషిస్తున్నారు. అలాగే ఆర్. జవహర్ దర్శకత్వంలోను ఓ సినిమా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

రవిబాబు, పూర్ణ కలయికలో అసలు ట్రైలర్‌.!

ఏప్రిల్ 15న కమెడియన్ సూరి సినిమా విడుదల..

రుద్రుడు..థియేట్రికల్ ట్రైలర్

- Advertisement -