పవన్‌ – బాబు భేటీ..వారి గురించే చర్చ!

14
- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దాదాపు గంటన్నర పాటు ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి. తొలిజాబితాలో సీట్లు దక్కని నేతల బుజ్జగింపు, రెండో జాబితాపై ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

రెండో జాబితాలో టీడీపీతో పాటు జనసేనకు కొన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా అసంతృప్తుల బుజ్జగింపు ఎలా అనేదానిపైనే చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే పవన్ – చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తొలి జాబితాలో టీడీపీ 94,జనసేనకు 24 సీట్లు కేటాయించారు చంద్రబాబు. అయితే పవన్ మాత్రం ఐదు స్థానాలకే అభ్యర్థులను ప్రకటించారు.

Also Read:ఆ నటి పై కూడా లైంగిక వేధింపులు

- Advertisement -