ఢిల్లీలో TRS కార్యాలయానికి స్థలం కేటాయింపు..

266
trs bhavan
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయ భవన నిర్మాణం కోసం న్యూఢిల్లీ లోని వసంత్ విహార్‌లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీకి కేటాయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్యూటీ ల్యాండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ దీన్ దయాల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ కి శుక్రవారం లేఖ రాశారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో స్థలం కేటాయింపు ప్రక్రియ ముగిసినందున త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన జరిపి, త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

- Advertisement -