విదేశీ ప్రయాణికులకు కేంద్రం గుడ్‌న్యూస్

120
omicron
- Advertisement -

విదేశీ ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది.విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఐసోలేషన్​ నిబంధనలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.విదేశీ ప్రయాణికుల రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. ఈ కొత్త నిబంధనలు జనవరి 22న అమలులోకి వస్తాయని పేర్కొంది.

ఎయిర్​పోర్ట్​లో నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్​​ వచ్చిన వారికి గతంలో మాదిరిగా ఐసోలేషన్ కేంద్రంలో ఉండటం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. కరోనా రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు సాధారణ కొవిడ్​ ప్రోటోకాల్​ అనుసరిస్తే సరిపోతుందని వెల్లడించింది.

విదేశీ ప్రయాణికుల కోసం సవరించిన మార్గదర్శకాలు మినహా మిగతా నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని కేంద్రం స్పష్టం చేసింది.

- Advertisement -