రవితేజ తల్లిపై పీఎస్‌లో కేసు

104
rt
- Advertisement -

ప్రముఖ హీరో రవితేజ తల్లి భూపతిరాజు రాజ్యలక్ష్మి పై జగ్గంపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. తహశీల్దార్ కు మైనింగ్ శాఖ సహాయ కార్యదర్శి ఇంజనీర్ జగదీష్ చేసిన ఫిర్యాదు మేరకు తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం కుడి కాలువ కు సంబంధించిన నిర్మాణ పనులను ధ్వంసం చేశారని పేర్కొన్నారు.

రామవరం హైవే సమీపంలో లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు వేసిన లే అవుట్ చదును చేసేందుకు మర్రిపాక గ్రామానికి చెందిన కాపవరపు సంజయ్ … 108 సర్వే లోని రాజ్యలక్ష్మి కి చెందిన 50 ఎకరాల భూమి లోని మట్టి తరిలించేందుకు ప్రణాళికలు వేసారు. అయితే ఆ భూమి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి 10 ఎకరాలలోని మట్టిని యంత్రాలతో తవ్వేసారు. అదే సమయంలో పుష్కర కుడి కాలువ కు సంబంధించిన కొండను తొలిచి మట్టి కొల్లగొట్టారు. రైతులు ఫిర్యాదు చేయడంతో కదలిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు అందించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరకుండా పాడైన నిర్మాణాలను బాగు చేయించాలని తహసీల్దార్ ను సంబంధిత అధికారులు కోరడం విశేషం.

- Advertisement -