సీనియర్ సిటిజన్స్‌కు షాకిచ్చిన కేంద్రం!

63
railways
- Advertisement -

సీనియర్ సిటిజన్స్‌కు షాకిచ్చింది కేంద్రం. ట్రైన్ ప్యాసింజర్లకు ఇకపై మళ్లీ రాయితీల పునరుద్ధరణ ఉండదని , సీనియర్ సిటిజన్స్‌కు టికెట్ బుకింగ్ తగ్గింపు ఇక లభించదని తేల్చిచెప్పింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో ఈ విషయాన్ని వెల్లడించారు.

2020 మార్చి నెలలో సీనియర్ సిటిజన్స్‌కు టికెట్ ధరలపై రాయితీ బెనిఫిట్‌ను తొలగించింది. కోవిడ్ 19 కారణంగా ట్రైన్ సర్వీసులను నిలివేసిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తర్వాత కరోనా తగ్గినప్పటి నుంచి ట్రైన్ సర్వీసులను క్రమక్రమంగా పునరుద్ధరిస్తూ వచ్చారు. ఇప్పుడు రైల్వే సర్వీసులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ కూడా టికెట్ ధరల రాయితీని మళ్లీ అమలు చేస్తారని ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు వీళ్ల ఆశలపై కేంద్రం నీళ్లు జల్లింది. టికెట్ ధరలపై రాయితీని తీసుకువచ్చే ఆలోచన లేదని స్పష్టం చేసింది.

- Advertisement -