బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో తో వార్ వన్ సైడ్:అశోక్ గౌడ్

22
- Advertisement -

బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో దేశ సంక్షేమానికే దిక్సూచని, 1౦౦ సీట్లతో మూడోసారి అధికారం లోకి రాబోతుందని, బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో తో వార్ వన్ సైడ్ అయిందని ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ధీమా వ్యక్తం చేశారు.బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలందరికి ఒక భరోసా, ఒక అండ అని, ఖంఢంతాల్లో ఉన్న తెలంగాణ ప్రవాసులందరు బీఆర్‌ఎస్‌ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోపై హర్షం వక్తం చేసారని అశోక్ గౌడ్ తెలిపారు.

ఉద్యమ నాయకులే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య మంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని, తెలంగాణ ప్రజలకి ఏంకావాలో కెసిఆర్ గారికి తెలుసన్నారు.2014, 2018 ఎలక్షన్స్ మేనిఫెస్టోలో ప్రవేశ పెట్టిన అంశాలే కాకుండా తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ఎన్నో కొత్త పధకాలు బీఆర్‌ఎస్‌ పార్టీ తీసుకొచ్చిందని గుర్తుచేసారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలక్షన్స్ కన్నా తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ముఖ్య మన్నారు.

చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే రాష్ట్రమంతటా ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తుందని తెలియజేసారు, కెసిఆర్ గారిని 1౦౦ సీట్లతో గెలిపించుకుంటామని ధీమా వక్తం చేసారు.ఇప్పటికీ ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం చేస్తుందని, రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో ఉదృతంగా ప్రచారం నిర్వహిస్తుందని అశోక్ తెలిపారు.

Also Read:నడుంనొప్పితో బాధపడుతున్నారా?

- Advertisement -