రెస్ట్ లేదు..రిలాక్స్ అయ్యేది లేదు:కవిత

492
- Advertisement -

అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ముషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ…. తెలంగాణ ఉద్య‌మం త‌ర‌హాలో కొత్త ఉద్య‌మాన్ని ప్రారంభిద్దామ‌ని తెలంగాణ జాగృతి కార్య‌క‌ర్త‌ల‌కు క‌విత పిలుపునిచ్చారు. తెలంగాణ ఆడపిల్లల కళ్ల నుంచి నీళ్లు రావు నిప్పులు వస్తాయని అన్నారు. ఎట్టి పరిస్థితిల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మందుకు వెళ్లాలి అని పిలుపునిచ్చారు.

కన్యాకుమారి నుంచి క‌శ్మీర్ దాకా దాడులు చేస్తున్నారు. దాడుల‌కు భ‌య‌ప‌డేది లేదు. మ‌న స‌మ‌యాన్ని వృధా చేస్తున్నారు.. మ‌న‌కు మిగిలిన స‌మ‌యంలో డబుల్, ట్రిపుల్ ప‌ని చేయాలి కానీ వెన‌క్కి త‌గ్గొద్దు. తెలంగాణ ఆడ‌పిల్ల‌ల క‌ళ్ల నుంచి నీళ్లు రావు.. నిప్పులు వ‌స్తాయి. వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తే లేదు.. ముందుకు వెళ్లాలి. ప్ర‌జ‌ల శ‌క్తి, వారి ప్రేమ ఏంటో తెలిసిన వాళ్లం మ‌నం. ప్ర‌జ‌ల‌ను ఒక శ‌క్తిగా మ‌లిచిన‌టువంటి వాళ్లం. ప్ర‌తి చోట మ‌న కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేయాలి. రెస్ట్ తీసుకునేది లేదు.. రిలాక్స్ అయ్యేది లేదన్నారు. మన భాష‌, పండుగ‌ల మీద జ‌రుగుతున్న వివ‌క్ష‌ను ఉద్య‌మంలో భాగంగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాం. ఆనాడు బ‌తుక‌మ్మ ఎత్తుకోవాలంటే సిగ్గుప‌డేవారు. ఇప్పుడు బ‌తుక‌మ్మ పండుగ అంటే సంతోషంగా జ‌రుపుకుంటున్నారు. అనేక మంది యువ‌కులు, క‌ళాకారులు పాల్గొంటున్నారు.

యువ‌తీయువ‌కులు ఈ దేశం గురించి ఆలోచించాలి అని క‌విత సూచించారు. తెలంగాణ కోసం గొంతెత్తాం. మ‌న హ‌క్కు అడిగాం. మ‌న దేశంలో ఇవాళ ఎలాంటి ప‌రిస్థితి ఉంద‌నే విష‌యాన్ని తెలుసుకోవాలి. మ‌న హ‌క్కుల‌ను కోల్పోతున్నామ‌న్న విష‌యం తెలియ‌కుండా ఉన్నాం. మేధావులు మాట్లాడ‌టం బంద్ చేసిండ్రు. క‌వులు గ‌ళ‌మెత్త‌డం మానేసిండ్రు. ర‌చ‌యిత‌లు పుస్త‌కాలు రాయ‌డం మానేసిండ్రు. అంద‌రూ నిరాశ నిస్పృహ‌ల్లో ఉన్నారు. ర‌చ‌యిత‌లు త‌మ‌కు వ‌చ్చిన అవార్డుల‌ను కేంద్రానికి విసిరికొట్టారు అని క‌విత గుర్తు చేశారు. ఇవాళ తెలంగాణ జాగృతి నుంచి ప్ర‌తి రాష్ట్రానికి వెళ్లి దేశ వ్యాప్తంగా అనేక అంశాల‌ప‌ట్ల జాగృతం చేయాలి. ఆ అవ‌స‌రం క‌న‌బ‌డుతుంది అని క‌విత పేర్కొన్నారు.

ప్ర‌జాస్వామ్య యుతంగా ఎన్నోబోబ‌డిన స‌ర్కార్ల‌ను బీజేపీ ప్ర‌భుత్వం కూల్చేస్తుంటే, పెద్ద పెద్ద ప‌త్రిక‌లు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే వార్తా క‌థ‌నాలు రాస్తున్నాయి. ప్ర‌జాస్వామ్యాన్ని కేంద్రం అప‌హాస్యం చేస్తోంది. తెలంగాణ‌లో చేసిందే దేశంలో చేయాలి. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను కాపాడిన‌ప్పుడే.. ఆ సిస్ట‌మ్ మ‌న‌ల్ని కాపాడుకుంటుంద‌న్నారు. కేంద్రం త‌ప్పుల‌ను దేశ ప్ర‌జ‌ల‌కు వివ‌రించి చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. బీజేపీ త‌ప్పుల‌ను ఎత్తి చూపితే దాడులు చేస్తున్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని ప్ర‌తిప‌క్షాల‌పై దాడులు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు న‌ష్టం క‌లిగించే విధంగా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని క‌విత మండిప‌డ్డారు.

ఇవి కూడా చదవండి…

ఏపీలో బి‌ఆర్‌ఎస్.. మంచిదే : సజ్జల

గుజరాత్ ఎన్నికల్లో కోటీశ్వరులదే విజయం!

టీ కాంగ్రెస్ నేతల్లో ముసలం.. !

- Advertisement -