డీజీపీ రవిగుప్తాను కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం

8
- Advertisement -

డీజీపీ రవి గుప్తాను కలిశారు బీఆర్ఎస్ నేతల బృందం. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతల దాడులపై ఫిర్యాదు చేశారు. హుజూర్ నగర్, మానకొండూర్, భూపాలపల్లి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల పై దాడులను, జరిగిన హత్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లింది బీఆర్ఎస్ నాయకుల బృందం.

నిన్న మంత్రి కోమటి రెడ్డి సమక్షంలో ఆయన ప్రోద్భలంతో భువనగిరి జడ్పి చైర్మన్ సందీప్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు జరిపిన దాడిని డీజీపీకి వివరించారు బీఆర్ఎస్ నాయకులు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని తక్షణమే అడ్డుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు నేతలు.

కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించేలా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని కోరారు బీఆర్ఎస్ నేతలు.డీజీపీని కలిసిన వారిలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైది రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, కోరుకంటి చందర్, భువనగిరి జెడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి, సూర్యపేట జెడ్పి చైర్ పర్సన్ దీపిక, బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు రావుల శ్రీధర్ రెడ్డి, రాకేష్ కుమార్ తదితరులు ఉన్నారు.

Also Read:IND vs ENG :రెండో టెస్ట్ గెలవాల్సిందే?

- Advertisement -