యూపీలో పడవ బోల్తా..8 మంది మృతి!

7
- Advertisement -

యూపీలో పడవ బోల్తా.. ఎనిమిది మంది మృతి చెందినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్-భారత్‌పూర్ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కౌదియాలా నదిలో పడవ బోల్తా పడింది.

ఈ ఘటనలో ఓ 60 ఏళ్ల మహిళ నీట మునిగి మృతిచెందింది. అనంతరం ఐదుగురు పిల్లలతో సహా ఎనిమిది మంది మృతి చెందినట్లు సమాచారం. పొరుగున ఉన్న లఖింపూర్ జిల్లాలోని ఖైరాతియా గ్రామానికి చెందిన 22 మంది పడవలో భారత్‌పూర్‌కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పడవ బోల్తా పడిందని స్థానికులు తెలిపారు.

Also Read:ఫేస్‌బుక్‌ తరహాలో వాట్సాప్‌లోనూ!

- Advertisement -