బీజేపీ…చార్మినార్-గొల్కోండను అమ్మేస్తుంది: కేటీఆర్ ఫైర్

185
ktr
- Advertisement -

బీజేపీ నేతలు గోబెల్స్ కు కజిన్ బ్రదర్స్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారుమంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్….బీజేపీ వాళ్ళ చార్జీ షీట్ గోబెల్స్ డైరీ లా ఉంది …కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడారు..టీ ఆర్ ఎస్ ఎంఐఎం సర్కార్ అని అర్ధ సత్యాలు మాట్లాడారని దుయ్యబట్టారు.

ఇక్కడ టీ ఆర్ ఎస్ సర్కారే ఉంది…అక్కడే బీజేపీ ముస్లిం వ్యతిరేకత బయట పడుతోంది…జమ్మూ కాశ్మీర్ లో వేర్పాటు వాద పార్టీ పీడీపీ తో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది నిజం కాదా ?…అసలు మా మీద చార్జీ షీట్ వేసే హాక్కు బీజేపి కి ఎవరిచ్చారు…కొత్తగా ఏర్పాటైన తెలంగాణ ఆరేళ్లలో ప్రగతి పథాన దూసుకు పోతున్నందుకా మా మీద చార్జీ షీటూ ?అని ప్రశ్నించారు.

2000 సంవత్సరం లో ఏర్పాటైన రాష్ట్రాల కంటే 2014 లో ఏర్పాటైన తెలంగాణ అన్నింటా ముందుకు దూసుకు పోతున్నందుకా చార్జీ షీటూ ?…బీజేపీ మీద చార్జీ షీట్ వేయాలంటే చాలా అంశాలు ఉన్నాయి…నా ప్రశ్నలకు సూటి ,సుత్తి లేకుండా కిషన్ రెడ్డి ,మిగతా మంత్రులు సమాధానం చెప్పాలి…హైదరాబాద్ కు రాజ్యాంగ బద్దంగా ఇవ్వాల్సినవి కాకుండా ఒక్క పైసా అదనం గా కేంద్రం నుంచి ఇచ్చారని చెప్పగలరా ?…లాభాల్లో ఉన్న కేంద్ర సంస్థలను అమ్ముతున్నందుకు బీజేపీ మీద చార్జీ షీట్ వేయాలన్నారు.

బీజేపీ చార్మినార్ ,గోల్కొండ లను కూడా డిజిన్వెస్టు మెంట్ చేస్తుంది..దేశ ప్రయోజనాల కోసమా డిజిన్వెస్టు మెంటు అని చెబుతున్నారు ..కొందరు గుజరాత్ పెద్దల కోసం కాదా ?
…ఏటా 2 వేల కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని మోడీ చెప్పారు…ఆరేళ్లకు 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వని మోడీ పై 12 కోట్ల మంది నిరుద్యోగులు చార్జీ షీట్ వెయ్యాలి…20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజి లో ఎన్ని సున్నాలు ఉన్నాయో కేంద్రమంత్రులకు తెలుసా..ప్రతీ ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని వేయనందుకు ఛార్జీ షీట్ వేయాలి…మొత్తం 132 కోట్ల ఛార్జీ షీట్లు వేయాలి బీజేపీ మీద…జీడీపీ ని తిరోగమన దిశలో తీసుకెళ్లినందుకు బీజేపీ మీద వెయ్యాలి చార్జీ షీట్…పీడీపీ వంటి వేర్పాటు వాద పార్టీ తో పొత్తు తో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ మమ్మల్ని వేర్పాటు వాద పార్టీ అంటారా ?ఈ అబద్ధాలకు బీజేపీ మీద వెయ్యాలి ఛార్జీషీట్…బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనందుకు బీజేపీ మీద వెయ్యాలి చార్జీ షీట్…నవోదయ పాఠశాలలు కేటాయించనందుకు మా విద్యార్థులు వెయ్యాలి బీజేపీ మీద చార్జీ షీట్ వేయాలన్నారు.

కొత్త వ్యవసాయ బిల్లులు తెచ్చినందుకు తెలంగాణ రైతులు వెయ్యాలి బీజేపీ మీద చార్జీ షీట్…itir ను రద్దు చేసినందుకు హైదరాబాద్ ప్రజలు వెయ్యాలి బీజేపీ మీద చార్జీ షీట్
…వరద సాయం చేయనందుకు బీజేపీ మీద చార్జీ షీట్…రోడ్ల అభివృద్ధికి అడ్డుపడుతున్న బీజేపీ కి కంటోన్మెంట్ ప్రజలు చార్జీ షీట్ వేస్తారు..బీజేపీ వస్తే చార్మినార్ ,గోల్కొండ లను ghmc ని కూడా అమ్మేస్తారు..మోడీ మేక్ ఇన్ ఇండియా నినాదం బెచో ఇండియా గా మారింది…మాది సోచో ఇండియా నినాదం…విజ్ఞులైన హైద్రాబాద్ ప్రజలు ఆలోచించాలి
…టీ ఆర్ ఎస్ మహిళా కార్పొరేటర్ యే మేయర్ అవుతారు…బీజేపీ నేతలు పచ్చ కామెర్లు వచ్చిన వారిలా ఎంఐఎం మేయర్ అవుతారని ప్రచారం చేస్తున్నారు..మేము మొదటి స్థానం లో ఉంటాం .ఎంఐఎం రెండో స్థానం లో ఉంటుంది ..మిగతా స్థానాలు మిగతా పార్టీ లు తేల్చుకోవాలి..ఎంఐఎం తోనే మాకు పోటీ అని స్పష్టం చేశారు కేటీఆర్..

- Advertisement -