అంతర్జాతీయ సంస్థలను అమ్ముకున్న ఘనత బీజేపీది:కేటీఆర్‌

273
ktr
- Advertisement -

కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు ఇంగిత జ్ఞానం లేదని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఛార్జీషీట్ దాఖలు చేస్తామని చెప్పి కేంద్రమంత్రి తప్పుచేశారని తెలిపారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలను అంతా ప్రశంసిస్తుంటే బీజేపీ నేతలు అబద్దాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నారని చెప్పారు. ఒకే అబద్దాన్ని 1000 సార్లు ప్రచారం చేస్తూ బీజేపీ నేతలు విషం గక్కుతున్నారని చెప్పారు. బీజేపీ వాళ్లు గోబెల్స్‌ కజిన్ బ్రదర్స్ అన్నారు.

ముస్లింలంటే బీజేపీ నిలువెల్లా విషం నింపుకుందన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసినందుకా టీఆర్ఎస్‌పై ఛార్జీ షీట్ దాఖలు చేస్తారా అని ప్రశ్నించారు.అంతర్జాతీయ సంస్థలను అమ్ముకున్న చరిత్ర బీజేపీదే అన్నారు. బీజేపీ దివాళ విధానాలతో దేశ ఆర్ధిక పరిస్ధితి దిగజారిపోయిందన్నారు. బలమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ ఉన్న దేశాన్ని దిగజార్చిన ఘనత బీజేపీదే అన్నారు.

- Advertisement -