ఎన్బీటీ నగర్‌లో మంత్రి ఇంద్రకరణ్ పాదయాత్ర..

143
minister indrakaran
- Advertisement -

కాంగ్రెస్,బీజేపీ పార్టీల బూటకపు మాటలను ప్రజలు నమ్మే పరిస్ధితిలో లేరని స్పష్టం చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. బంజారాహిల్స్ డివిజన్‌లోని ఎన్బీటీ నగర్‌లో పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలుపును ఆపలేరని చెప్పారు.

టీఆర్ఎస్ కార్పొరేట‌ర్ అభ్యర్థి గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, అల్లోల దివ్యారెడ్డితో క‌లిసి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించిన ఇంద్రకరణ్‌… హైదరాబాద్ ను విశ్వ నగరంగా అభివృద్ధి చేస్తున్నామని, హైదరాబాద్ లో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని, ఎంతో మంది ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొన్నారు.

ప్రజల స‌మ‌స్యలపై టీఆర్ఎస్ కు ఉన్న ప‌ట్టింపు మరే ఇత‌ర పార్టీల‌కు లేద‌ని చెప్పారు. నీటి ప‌న్ను ర‌ద్దు చేయ‌డంతో పాటు సెలూన్లు, దోబీ ఘాట్లు, లాండ్రీల‌కు ఉచిత క‌రెంట్ ఇస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వ‌ర్గాల‌కు మేలు చేకుర్చే నిర్ణయం తీసుకుంద‌న్నారు.

- Advertisement -