బీజేపీ నేత ఉమాభారతికి కరోనా…

173
uma bharati
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60 లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారీన పడగా తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, సీనియర్‌ పార్టీ నేత ఉమాభారతికి కరోనా సోకింది.

ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ఉమా భారతి. గత మూడు రోజులుగా కొద్దిపాటి జ్వరం ఉంది…ఎందుకైనా మంచిదని టెస్ట్‌ చేయించుకున్నాను. ఆ తర్వాత వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్‌ తేలిందన్నారు.

గత కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్‌ అయిన వారంతా వెంటనే పరీక్షలు చేయించుకోండి. టెస్టులు పూర్తయ్యే వరకూ ఎవరినీ కలవకుండా క్వారంటైన్‌ లో ఉండటం మంచిదని ఉమాభారతి పేర్కొన్నారు.

- Advertisement -