రాహుల్ గాంధీ కాన్వాయ్‌పై నల్లజెండాలు

6
- Advertisement -

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026 సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు చేపట్టిన నిరసనలకు ప్రతిస్పందనగా బీజేపీ కార్యకర్తలు ఢిల్లీ, ముంబై నగరాల్లో భారీ ఆందోళనలు నిర్వహించారు. ఈ నిరసనల్లో ముఖ్యంగా రాహుల్ గాంధీను లక్ష్యంగా చేసుకున్నారు. రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు బీజేపీ కార్యకర్తలు నల్లజెండాలు చూపినట్లు సమాచారం.

యూత్ కాంగ్రెస్ నిరసన ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించిందేనని తెలుస్తోంది. ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపాదిత ఇండియా–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అది బాహ్య ఒత్తిళ్ల మధ్య కుదిరిందని ఆరోపించారు.

బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర..ఢిల్లీలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీయాలని ప్రయత్నించిందని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సహా నలుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్ ఈ నిరసనలను ప్రతిపక్షాల అహంకారం, నిరాశకు నిదర్శనంగా అభివర్ణించారు. అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్, గజేంద్ర సింగ్ షెకావత్, ప్రహ్లాద్ జోషి, కిరెన్ రిజిజు వంటి ఇతర కేంద్ర మంత్రులు కూడా ఈ చర్యను “అవమానకరం”గా విమర్శించారు.

ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలపై విపులమైన స్పందన ఇవ్వలేదు.

Also Read:Tomato:టమోటాతో ప్రయోజనాలు

- Advertisement -