అర్చకత్వం బ్రాహ్మణుల వంశపారపర్యం కాదు:స్వామి

125
mp
- Advertisement -

బ్రాహ్మణులే వంశపారపర్యంగా అర్చకత్వానికి అర్హులు అనడం సరికాదన్నారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. హిందూ దేవాలయాలపై ఎక్కడ అసత్య ప్రచారం చేసిన ముందుంటానని తెలిపారు. దేశంలోని హిందూ దేవాలయాలు ఎక్కడ ప్రభుత్వ ఆదీనంలో ఉండకూడదన్నారు. పురాణాల్లో విశ్వామిత్రుడు, వాల్మీకిలు బ్రాహ్మణులు కాకపోయినా ప్రచారం చేసి మహాత్ముడిగా ఆధ్యాత్మిక ప్రచారం చేశారన్నారు.

భారత దేశంలో 80 శాతం మంది హిందువులు ఉన్నారని….హిందువుగా ఉన్నందుకు గర్విస్తున్నాను అని వెల్లడించారు. అనువంశిక అర్చకత్వంకు తాను వ్యతిరేకం అని…రమణ దీక్షితుల ట్వీట్ లు నేను గమనించలేదన్నారు. దేశంలోని నాలుగు లక్షల హిందూ దేవాలయాలపై అసత్య ఆరోపణలు చేస్తే సహించను, న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

టిటిడి వెబ్ సైట్ లో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారన్న ఒక పత్రిక ఆరోపణలపై టీటీడీ ఈవో విజ్ఞప్తి మేరకు కేసు వేశానని తెలిపారు. అసత్య వార్తలు రాసిన తెలుగు దినపత్రిక క్షమాపణ చెప్పాలి, 100 కోట్లు జరిమాన చెల్లించాలన్నారు.

- Advertisement -