ముందంజలో బీజేపీ..

305
- Advertisement -

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8గంటల నుంచి ఎన్నికల అధికారులు కౌంటింగ్‌ ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యంత పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల సమరాంగణంలో హోరాహోరీన తలపడిన అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామ్య పండగలో ఉత్సాహంగా పాల్గొన్న ఓటర్లు ఫలితాల కోసం ఉద్వేగంతో వేచి చూస్తున్నారు.

BJP

ఎన్నికల ఫలితాలలో భాగంగా లీడ్స్ వచ్చేశాయి. దేశవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 77 లోక్ సభ స్థానాల్లో లీడ్ లో ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 28 చోట్ల లీడ్ లో ఉన్నారు. రాజస్థాన్ లో బీజేపీ హవా చూపిస్తోంది. కాగా, ఇవి పోస్టల్ బ్యాలెట్ లీడ్ వివరాలు. అసలు ఈవీఎంలు మరికాసేపట్లో తెరచుకోనున్నాయి.

- Advertisement -