Errabelli:బీజేపీ..దొంగల పార్టీ

46
errabelli
- Advertisement -

భారతీయ జనతా పార్టీపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్‌, మహబూబాద్‌ జిల్లాల్లోని పాలకుర్తి, తొర్రూరు, పెద్దవంగరలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి..బీజేపీ దొంగల పార్టీ అని రైతులంటే వారికి అసలు గిట్టదన్నారు. పేదలను దోచి పెద్దలకు కట్టబెట్టాలన్నదే బీజేపీ సిద్ధాంతమన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల పంటల కోసం ఎదురుపెట్టుబడి పెడుతున్నదని వెల్లడించారు. రాష్ట్రంలో ఈ యాసంగిలో 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వ్యవసాయం పండుగలా మారిందని…కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరానికి నీళ్లు అందించిన ఘనత ముఖ్యమంత్రిదేనని వెల్లడించారు. రైతుల కోసం మాత్రమే సీఎం కేసీఆర్‌ వేల కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఈ యాసంగిలో వరి ధాన్యం మద్ధతు ధరను ఏ- గ్రేడ్‌ ధాన్యానికి రూ.2,060, బీ- గ్రేడ్‌ ధాన్యానికి రూ.2,040గా నిర్ణయించామన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -