విరాళాలలో బీజేపీ రికార్డు!

79
- Advertisement -

అత్యధిక డొనేషన్లు పొందిన రాజకీయ పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా 12 ప్రధాన రాజకీయ పార్టీలకు రూ.258 కోట్ల విరాళాలు అందగా ఇందులో 82 శాతం అంటే ఏకంగా రూ.212 కోట్లు బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి.

బీజేపీ తర్వాత రూ.27 కోట్లు విరాళాల‌తో ఆ పార్టీ మిత్రపక్షమైన జేడీయూ రెండో స్థానంలో నిలిచింది. ఇది 10.45 శాతానికి సమానం. దేశంలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్, ఎన్పీపీ, ఏఐఏడీఎంకే, డీఎంకే, ఆర్జేడీ, ఆప్, ఎల్పేజీ, సీపీఎం, సీపీఐ, ఎల్జేపీలకు కలిపి మొత్తం రూ.19 కోట్లే విరాళంగా అందాయి. ఈ మేరకు ఎలక్టోరల్ ట్రస్టులు ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించాయి.

దేశంలో మొత్తం 23 ఎలక్టోరల్ ట్రస్టులు ఉండగా.. వాటిలో 16 ట్రస్టులు ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించాయి. ఈ రిపోర్ట్స్ చూస్తే గత మూడేళ్లుగా బీజేపీ విరాళాల సేకరణతో పాటు ధనిక పార్టీగా అవతరించింది.

- Advertisement -