బీజేపీ బండి సంజయ్‌కి అస్వస్థత…

22
bandi
- Advertisement -

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కు అస్వస్థతకు గుయ్యారు. 11వ రోజు పాదయాత్రలో భాగంగా వడదెబ్బ, ఎసిడిటీ లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాదయాత్ర శిబిరం వద్ద డాక్టర్ శరత్ ఆధ్వర్యంలో డాక్టర్లు చికిత్స అందించారు.

పాదయాత్రకు కొంత విరామం ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. డీహైడ్రేషన్, ఎసిడిటీ వల్ల బండి సంజయ్ కొంత బలహీనంగా వున్నారు డాక్టర్ శరత్ వెల్లడించారు. బండి సంజయ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాలని డాక్టర్లు సూచించినా…ఆయన మాత్రం పాదయాత్ర చేసేందుకునే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

- Advertisement -