చైనాలో మరింత కఠినంగా లాక్‌డౌన్‌..

75
- Advertisement -

చైనాలో కరోనా కేసుల సంఖ్య ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న అదుపులోకి రాకపోవడంతో మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయించారు అధికారులు. తాజాగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న షాంఘై నగరంలో ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.

ఇప్పటికే అనేక ప్రాంతాలను బారికేడ్లతో మూసివేసిన అధికారులు, ఇప్పుడు కరోనా సోకిన వారి ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రెండు మీటర్ల ఎత్తు ఉన్న ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

షాంఘై నగరంలో దాదాపు రెండున్నర కోట్ల మంది పౌరులు నివసిస్తున్నారు. ఇళ్లల్లోనే ఉండటంతో చాలామందికి ఆహారం, మంచి నీళ్లు కూడా దొరకడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -