పాల ఉత్పత్తులపై జీఎస్టీ..టీఆర్ఎస్ నిరసన

45
gst
- Advertisement -

కేంద్రం ప్రభుత్వం తాజాగా పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ ఆందోళన బాటపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

అన్ని జిల్లాల్లో నేడు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు, పాల ఉత్పత్తులపై పన్ను విధించడంతో జరిగే నష్టాన్ని వివరించాలన్నారు. ఆందోళన కార్యక్రమాల్లో రైతులను ముఖ్యంగా పాడి రైతులను భాగస్వాములుగా చేయాలని వెల్లడించారు.

- Advertisement -