బిహార్ తొలిదశ పోలింగ్…అప్‌డేట్

220
bihar
- Advertisement -

బీహార్ లో తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి తొలిదశలో 71 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా మొత్తం 1066 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఎన్నికల సంఘం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.తొలివిడతలో జేడీయూ 35, బీజేపీ 29, ఆర్జేడీ 42, కాంగ్రెస్ 20, ఎల్జేపీ 41చోట్ల బరిలో ఉంది.

ఎన్డీయే తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నితీష్ కుమార్,మహా ఘట్బంధన్ తరపున తేజస్వీ యాదవ్ పోటీలో ఉన్నారు. రెండోదశ పోలింగ్ నవంబర్ 3వ తేదీన, మూడోదశ పోలింగ్ నవంబర్ 7 వతేదీన జరగనుంది. నవంబర్ 10 వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

- Advertisement -