బిగ్‌బాస్‌ 5: ఎపిసోడ్ 78 హైలైట్స్

142
- Advertisement -

బిగ్‌బాస్‌ 5 సీజన్‌లో చివరి కెప్టెన్సీ టాస్క్‌ మొదలైంది. దీనిలో భాగంగా ఇంటి సభ్యులకు ‘నియంత మాటే శాసనం’అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ టాస్క్‌ కోసం గార్డెన్‌ ఏరియాలో నియంత సింహాసనం ఏర్పాటు చేశారు. సైరన్‌ మోగిన ప్రతిసారి ఆ సింహాసనంలో ఎవరైతే ముందుగా కూర్చుంటారో వాళ్లు ఆ రౌండ్‌ ముగిసేవరకు నియంతలా వ్యవహరిస్తారు. అంతేకాదు ఆ రౌండ్‌ వరకు వాళ్లు సేఫ్‌ అవుతారు కూడా. మిగిలిన ఇంటి సభ్యులు తమని తాము సేవ్‌ చేసుకోవడానికి ఓ చాలెంజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ చాలెంజ్‌లో చివరి స్థానంలో నిలిచిన ఇద్దరి ఇంటి సభ్యుల్లో ఒకరిని సేవ్‌ చేసే అవకాశం నియంత కుర్చిలో కూర్చున్న వ్యక్తికి ఉంటుంది.

తొలి రౌండ్‌లో నియంత సింహాసనాన్ని సిరి దక్కించుకుంది. దీంతో నియంత సిరిని మినహాయించి మిగిలిన ఇంటి సభ్యులకు ఒక చాలెంజ్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్‌. గార్డెన్‌ ఏరియాలో హుక్స్‌కి వేలాదదీయబడిన క్యాప్‌లను చేతితో తాకకుండా తలకు ధరించి.. పక్కనే ఉన్న హుక్స్‌కి పెట్టాల్సి ఉంటుంది. ఈ చాలెంజ్‌లో రవి, సన్నీలు మాత్రమే చివరి రెండు స్థానాల్లో నిలిచి నియంత దగ్గరకు వెళ్లి తమ వాదనలు వినిపించారు. ఇద్దరి వాదనలు విన్న సిరి.. అందరు ఊహించినట్లే సన్నీని తొలగించి రవిని సేవ్‌ చేసింది. దీంతో బాగా హర్ట్‌ అయిన సన్నీ.. ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తున్నారని, ఫస్ట్‌ రౌండ్‌లోనే డిస్‌ క్వాలిఫై అయినందుకు బాధగా ఉందని షణ్ముఖ్‌ దగ్గర వాపోయాడు.

ఇక రెండో రౌండ్‌లో నియంత సింహాసనాన్ని శ్రీరామ్ చేజిక్కించుకున్నాడు. దీంతో మిగిలిన ఆరుగురికి మరో చాలెంజ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. కాళ్లకి చెప్పులు ధరించి ఎదురుగా ఉన్న గోడపై వీలైనంత ఎత్తులో అతికించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ ఎత్తులో ఆ చెప్పుల్ని అతికిస్తారో వాళ్లు సేవ్ అవుతారని.. తక్కువ ఎత్తులో చెప్పుల్ని అతికించిన చివరి ఇద్దరి సభ్యులు నియంతని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో మానస్‌ అందరికంటే ఎత్తులు చెప్పులు అతికించగా.. రవి, కాజల్‌ తక్కువ ఎత్తులు చెప్పులు అతికించి నియంత శ్రీరామ్‌ని ఎదుర్కొన్నారు. అయితే నియంతగా ఉన్న శ్రీరామ్ కాజల్‌ని నెక్స్ట్ రౌండ్‌కి పంపడానికి ఇష్టపడలేదు. ‘నేను ఇంతవరకు కెప్టెన్‌ కాలేదు. ఇదే నాకు చివరి చాన్స్‌.. ఇప్పుడు నేను కెప్టెన్‌ కావాలనుకుంటున్నా’అని రిక్వెస్ట్‌ చేసినప్పటికీ… ఆమెను పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి డిస్‌క్వాలిపై చేశాడు. దీంతో బాగా హర్ట్‌ అయిన కాజల్‌.. ‘ఈ తొక్కలో డిస్కషన్స్ ఎందుకు రవికి ఇస్తానని ముందే చెప్పొచ్చుగా’అంటూ శ్రీరామ్‌పై సీరియస్‌ అయింది. కెప్టెన్‌ అయ్యే చివరి అవకాశం లేకుండా పోయిదంటూ.. బాత్‌ రూంలోకి వెళ్లి వెక్కివెక్కి ఏడ్చింది. ప్రియాంక వెళ్లి ఆమెను ఓదార్చింది.

కెప్టెన్సీ టాస్క్ కోసం జ‌రుగుతున్న నియంత టాస్క్‌లో మూడో సారి ర‌వి.. నియంత సింహాసనాన్ని దక్కించుకున్నాడు. మిగిలిన ఇంటిసభ్యులకు ఆరెంజ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో చివరి రెండు స్థానాల్లో మానస్, షణ్ముఖ్‌లు నిల‌వగా, నియంత రవి .. షణ్ముఖ్‌ని సేవ్ చేసి మానస్‌ని డిస్ క్వాలిఫై చేశాడు. నాలుగో రౌండ్‌లో ప్రియాంక నియంత సింహాసనాన్ని దక్కించుకుంది. మిగిలిన ఇంటి సభ్యులకు వాటర్ డ్రమ్స్ టాస్క్ ఇచ్చారు. ఈ ఛాలెంజ్‌లో షణ్ముఖ్, శ్రీరామ్‌లు చివరి రెండు స్థానాల్లో నిలవడంతో వీళ్లలో ఒక్కర్ని సేవ్ చేసి.. ఒక్కర్ని డిస్ క్వాలిఫై చేసే అధికారం నియంతగా ఉన్న ప్రియాంక చేతుల్లోకి వెళ్లింది. షన్నూకి సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పింది. దీంతో శ్రీరామ్ గేమ్ నుంచి డిస్ క్వాలిఫై అయ్యాడు. దీంతో కాజల్ ఆనందానికి అవధులు లేవు.. డాన్స్ చేసి సెలబ్రేట్ చేసుకుంది.

ఐదో రౌండ్‌లో భాగంగా.. నియంత సింహాసనంపై కూర్చోవడానికి రవి, షన్నూ, సిరి, ప్రియాంకలు పోటీపడ్డారు. అయితే బజర్ మోగేసమయానికి సిరి, ప్రియాంకలు ఇద్దరూ ఒకేసారి సింహాసనంపై కూర్చున్నారు. అయితే ప్రియాంక కంటే సిరినే ముందు కూర్చున్నట్టుగా విజువల్‌లో కనిపించింది. మాన‌స్.. ప్రియాంకి స‌పోర్ట్ చేయ‌గా, ష‌ణ్ముఖ్…సిరి కూర్చుందని అంటున్నాడు. ఈ విష‌యంలో సిరి.. ప్రియాంకను గెలిపించాలని ఉంటే గెలిపించుకోండి కానీ.. అన్ ఫెయిర్ గేమ్ ఆడొద్దని చెప్పింది. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో సన్నీ-మానస్‌ల మధ్య గొడవ జరగడం ఆసక్తిగా ఉండ‌నుది. ఇద్దరి మిత్రుల మధ్య మంట పెట్టిన ఇష్యూ ఏంట‌నే దానిపై అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -