Bigg Boss 7 Telugu:ఎపిసోడ్ 9 హైలైట్స్

27
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ సో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 9 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. సండే ఫన్ డేలో భాగంగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు నాగార్జున. ఇక సన్ డే ఫన్ డేతో పాటు నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. అత్యధికంగా శివాజీ, పల్లవి ప్రశాంత్‌ని నామినేట్ చేశారు. ఇక నామినేషన్ సమయంలో పల్లవి ప్రశాంత్ తీరు చూసి ప్రతి ఒక్కరికి చిర్రెత్తుకొచ్చింది. ఓ మానసిక రోగిలాగ ప్రవర్తిస్తూ గబ్బుగబ్బు చేశాడు.

బిగ్ బాస్ ఇంటికి మొదటి సభ్యుడైనందుకు ఆట సందీప్‌ని అభినందించారు నాగ్. ఆ తర్వాత నామినేషన్స్ ప్రారంభం అయ్యాయి. సందీప్ పవరాస్త్రని గెలవడంతో పాటు.. ఐదు వారాలు ఇమ్యూనిటీ (నామినేషన్స్ లేకుండా) అవకాశం ఇచ్చారు. అదే సందర్భంలో సందీప్‌కి స్పెషల్ పవర్ ఇచ్చారు. ఇంటి నుంచి బయటకు పంపేందుకు ఒక హౌస్ మేట్స్‌ని నేరుగా నామినేట్ చేయొచ్చని చెప్పారు బిగ్ బాస్. తొలుత ప్రిన్స్ యావర్‌ని నామినేట్ చేశాడు సందీప్. తర్వాత వీరిద్దరి మధ్య వాడివేడిగా డిస్కషన్ జరుగగా సందీప్‌తో నేరుగా నామినేట్ కావడం వల్ల.. యావర్‌ని ఎవరూ నామినేట్ చేయడానికి వీళ్లేదని చెప్పారు బిగ్ బాస్.

ఇక ఈ సారి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరిని అయితే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి పేరు చెప్పి ముఖంపై రంగు, మట్టి పూయాలని చెప్పారు. ప్రతి కంటెస్టెంట్స్ తప్పనిసరిగా రెండు నామినేషన్స్ చేయాల్సి ఉంటుందని.. లేనిపక్షంలో బిగ్ బాస్ వాళ్లని నేరుగా నామినేట్ చేస్తారని చెప్పారు.

Also Read:Bhumana:శ్రీవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు

తొలుత టేస్టీ తేజాని నామినేట్ చేయాలనుకునే వాళ్లు ముందుకొచ్చి రీజన్ చెప్పాలని కోరగా పల్లవి ప్రశాంత్, శుభశ్రీ రాయగురు, రతికలు ముందుకొచ్చి నామినేషన్‌కి రీజన్లు చెప్పారు. ఈ క్రమంలో రతీక – టెస్టీ తేజా మధ్య వాగ్వాదం జరిగింది. తిని తొంగుంటున్నావ్ అని నువ్వు నన్ను అన్నప్పుడు.. ఏం పీకుతున్నావ్ అని నేను నిన్ను అనడంలో తప్పేంటి? అని అడిగాడు టేస్టీ తేజా. ఆ తరువాత పల్లవి ప్రశాంత్ కూడా.. టేస్టీని నామినేట్ చేస్తూ.. నువ్వు అందరిపై జోక్‌‌లు వేస్తావ్.. నీపై జోక్ వేస్తే మాత్రం తీసుకోవ్ అని తెలిపాడు. ఇక శివాజీ పేరు చెప్పగానే . ప్రియాంక, అమర్ దీప్, శోభా శెట్టి, షకీలా నామినేట్ చేయడానికి వచ్చారు. వాళ్లని చూసిన శివాజీ.. ఇంకా ఎవరైనా ఉంటే రండి అంటూ వెటకారం స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో సిల్లీ రిజన్స్ చెప్పడంతో శివాజీకి నచ్చలేదు. ఒక్కొక్కరి గాలి తీసేశాడు.

ఇక ప్రియాంక.. రంగునీళ్లు పోస్తుంటే.. పచ్చని చిలుకలు తోడుంటే అంటూ పాట పాడుతూ డాన్స్ చేశాడు శివాజీ. దెబ్బకి బిత్తరపోయింది ప్రియాంక.ఇక షకీలా అయితే.. అన్నా నువ్వు స్ట్రాంగ్.. నువ్వు ఉంటే.. నేను ఆడలేను అందుకే నామినేట్ చేస్తున్నా అని సింపుల్‌గా తేల్చేసింది.

Also Read:పెదకాపు1.. విజయం సాధించాలి: వినాయక్

- Advertisement -