బిగ్ బాస్ 5…షణ్ముఖ్ ఔట్

163
siri
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 తెలుగు 12 వారం ముగింపు దశకు చేరుకుంది. ఇక టాప్ -5కి చేరుకునే తొలి కంటెస్టెంట్ కోసం జరిగిన పోటీలో ముగ్గురి ఆట క్లోజ్ అయింది. గురువారం ఎపిసోడ్‌లో సన్నీ-షణ్ముఖ్‌ల మధ్య పోరు ఉత్కంఠగా సాగింది. మూడో దశలో హౌస్‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్లు పోటీ పడ్డారు. అయితే సిరి, శ్రీరామ్‌లు గాయాల పాలు కావడంతో వాళ్ల తరుపున మరో ఇద్దరు గేమ్ ఆడే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్.

శ్రీరామ్ తరుపున సన్నీ ఆడటానికి ముందుకు రాగా.. సిరి తరుపున ఆడటానికి ముందుకు వచ్చాడు షణ్ముఖ్. ఈసారి నా గేమ్ నేనే ఆడతా అని అప్పటివరకు కాళ్ల నొప్పులు అంటూ డ్రామా ఆడిందని అందరికి తెలిసిపోగా బిగ్ బాస్ ఆమెను ఆడించేందుకు ఒప్పుకోకపోవడంతో షణ్ముఖ్‌ ముందకొచ్చాడు. వాటర్ పోసి బాల్స్‌ని టబ్‌లలో పడేట్టు చేయడం.. ఎవరు ఫాస్ట్‌గా వాటర్ పోసి.. ఆ బాల్స్ అన్నీ ముందుగా పడేట్టు చేసి బెల్ కొడతారో వాళ్లే ఈ టాస్క్‌లో గెలిచినట్టు అని బిగ్ బాస్ తెలపగా శ్రీరామ్ తరపున నిలబడ్డ సన్నీ విజేతగా నిలిచాడు. తర్వాత కాజల్-ప్రియాంకలు పోటీపడగా.. చివర్లో షణ్ముఖ్, సన్నీ, మానస్‌లు పోటీపడ్డారు. అయితే ఈ టాస్క్‌లో కూడా మానస్.. తక్కువ టైంలో వాటర్ పోసి బాల్స్ టబ్‌లో పడేట్టు చేయడంతో విజేత అయ్యాడు. అయితే అందరికంటే తక్కువ వేసిన షణ్ముఖ్ ఏడోస్థానానికి పరిమితం అయ్యాడు.

మూడు టాస్క్‌లు కంప్లీట్ అయ్యేసరికి చివరి స్థానంలో నిలిచిన ముగ్గురు కంటెస్టెంట్లు నెక్స్ట్ లెవల్‌కి వెళ్లే అర్హతను కోల్పోతారని బిగ్ బాస్ చెప్పగా కాజల్ (8), ప్రియాంక(8)లు టికెట్ టు ఫినాలే నుంచి తప్పుకున్నారు. పదేసి పాయింట్లు దక్కించుకున్న షణ్ముఖ్-సన్నీలకు టై అయ్యింది. దీంతో మూడో పోటీదారుల్లో షణ్ముఖ్-సన్నీ టై బ్రేకర్ పెట్టారు.. ఈ టై బ్రేకర్ గెలిచిన వాళ్లే టికెట్ టు ఫినాలేకి వెళ్తారని చెప్పారు. మళ్లీ ఈ ఇద్దరూ పోటీపడగా.. షణ్ముఖ్ 22 సెకన్ల వ్యవధిలో బాల్స్ వేస్తే.. సన్నీ 20 సెకన్ల వ్యవధిలో బాల్స్‌ని షన్నూపై 2 సెకన్ల స్వల్ప తేడాతో గెలిచి.. టికెట్ టు ఫినాలేకి అర్హత సాధించాడు. దీంతో మానస్,శ్రీరామ్,సిరి,సన్నీ ఈ నలుగురు టికెట్ టు ఫినాలే కోసం తలపడనున్నారు.

- Advertisement -