మహేష్ కోసం మరో హీరోయిన్ ?

25
- Advertisement -

మహేష్ బాబు తో త్రివిక్రమ్ తీస్తున్న సినిమాలో సూపర్ స్టార్ సరసన పూజ హెగ్డే , శ్రీలీల ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ ను కూడా ఫైనల్ చేశాడట త్రివిక్రమ్. బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేఖర్ ని తీసుకున్నారట. అంటే మహేష్ కి సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారన్నమాట.

భూమి పెడ్నేఖర్ బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. అదిరిపోయే అందం కాకపోయినా తన పెర్ఫార్మెన్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. ఇక ssmb 28 లో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండే మరో హీరోయిన్ పాత్ర ఉండటంతో ఆ పాత్రకి భూమి కి ఫిక్స్ చేసుకున్నారట. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తయింది. నెలాఖరు నుండి మరో షెడ్యూల్ మొదలు కాబోతుంది. హైదరాబాద్ లో హౌస్ సెట్ వేసి అక్కడ కొంత ఘాట్ చేయబోతున్నారు. మహేష్ తో పాటు ఈశ్వరి రావు , రఘుబాబు ఇలా కొందరు ఆర్టిస్టులు షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు.

త్రివిక్రమ్ గత సినిమాల్లో రెండో హీరోయిన్ పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. అత్తరింటికి దారేది నుండి మొన్న వచ్చిన అల వైకుంఠ పురములో వరకూ సెకండ్ హీరోయిన్ కి పెద్ద ప్రాముఖ్యత దక్కలేదు. మరి ఈసారి రెండో హీరోయిన్ కి అలాగే మూడో హీరోయిన్ కి త్రివిక్రమ్ ఎలాంటి న్యాయం చేస్తాడో ?

ఇవి కూడా చదవండి..

- Advertisement -