శ్రీవారి సన్నిధిలో సూర్యకుమార్ యాదవ్..

31
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సూర్య కుమార్ యాదవ్ తో ఫోటోలు దిగడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు.

మిస్టర్ 360గా తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సూర్య. ప్రస్తుతం టీమిండియా ఆసీస్‌తో టెస్టు సిరీస్ ఆడుతుండగా మూడో టెస్టు మార్చి 1 నుండి ప్రారంభంకానుంది. మూడోటెస్టుకు సమయం ఉండటంతో శ్రీవారిని దర్శించుకున్నారు సూర్య.

ఇవి కూడా చదవండి..

- Advertisement -