జోడో జోష్‌…పాదయాత్రలో పరుగులు

155
rahul
- Advertisement -

తెలంగాణలో రాహుల్‌ జోడోయాత్ర కొనసాగుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి నుంచి 5వ రోజు రాహుల్‌ పాదయాత్ర ప్రారంభమైంది. రాహుల్‌ పాదయాత్రలో జానారెడ్డి పాల్గొన్నారు. ఇక.. షాద్‌నగర్‌ మండలం సోలిపూర్‌ జంక్షన్‌ వరకు ఈ పాదయాత్ర సాగనుంది. బాలానగర్‌ మండలంలోని పెద్దాయిపల్లిలో లంచ్ బ్రేక్‌ తీసుకోనున్నారు.

ఇక యాత్రలో భాగంగా పరుగులు పెట్టించారు రాహుల్. ఫిట్‌నెస్ లో భాగంగా రాహుల్‌ పరుగులు పెట్టగా రేవంత్‌తో పాటు మిగితా నేతలు కూడా పాల్గొన్నారు. ఇక భారత్ జోడో యాత్రతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ వచ్చింది.

ఇక నిన్న ఖమ్మం జిల్లా ఆదివాసీలు ప్రదర్శించిన కొమ్ము కోయ డ్యాన్స్ ను రాహుల్ ఆసక్తిగా తిలకించారు. స్త్రీ, పురుషులు కలసి లయబద్ధంగా అడుగులు వేస్తూ చేసే కొమ్ము కోయ ప్రదర్శనలో కళాకారులతో కలిసి రాహుల్ అడుగులు వేస్తూ ఉత్సాహ పరిచారు.

ఇవి కూడా చదవండి..

పసిడి ప్రేమికులకు శుభవార్త..

చండూరులో సీఎం కేసీఆర్ సభ..

నిన్న ఆడియో, రేపు వీడియో

 

- Advertisement -