క్రికెట్ ఆడిన రాహుల్ గాంధీ..

128
Rahul
- Advertisement -

భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ సరదాగా క్రికెటర్ అవతారమెత్తాడు. 5తరగతి చదివే బాలుడు యశోవర్ధన్ లో కలిగి హైదరాబాద్ పటాన్ చెరువు వద్ద క్రికెట్ ఆడారు. రాహుల్ బౌలింగ్ వేయగా యశోవర్ధన్ బ్యాటింగ్ ఆడాడు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సంపత్‌ కుమార్ ఇతరులు ఫీల్డింగ్ చేశారు.

congress

అయితే అంతకు ముందు రాహుల్ కు ఆ బాలుడు మధ్యతరగతి ప్రజలకు భారమైన ప్రైవేటు విద్య పై వినతిపత్రం అందచేశాడు. మీరు ప్రధాని అయితే ప్రైవేట్ స్కూలు ఫీజులపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేలా చూడాలని ..ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరచాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రాహుల్ ఆ అబ్బాయి క్రికెట్ బ్యాట్ పై ఆటోగ్రాఫ్ చేశారు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతమంతా కొలాహలంతో నిండింది.

ఇవి కూడా చదవండి..

మునుగోడు బిజెపికి ప్రతిష్టాత్మకమే

మట్టికుస్తీతో వస్తున్న విష్ణు విశాల్‌

మూడో విజయం నమోదు చేసుకున్న భారత్‌

- Advertisement -