గ్రేటర్‌లో మరింత కఠినంగా లాక్ డౌన్: సీఎం కేసీఆర్

180
cm kcr
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్‌లో లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ అమలుపై బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం… నగరం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, బయట నుంచి ఎవరూ లోపలికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం చురుకైన పోలీసు, వైద్యారోగ్య, ఐఏఎస్‌ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలన్నారు.

ముఖ్యంగా ఏపీ సరిహద్దు గ్రామాల నుండి ఎవరిని అనుమతించవద్దని ఆదేశించారు. కొత్త కేసులన్నీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోనే ఉన్నాయి కనుక ఈ జిల్లాలపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు.

- Advertisement -