టీమిండియా క్రికెటర్లకు గుడ్ న్యూస్..

194
kohli
- Advertisement -

టీమిండియా ఆటగాళ్లకు గుడ్ న్యూస్ తెలిపింది బీసీసీఐ. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ ముగిసిన తర్వాత 20 రోజుల పాటు రిలాక్స్‌ అయ్యే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది.

జూన్‌ 23న బయో బబుల్‌ను కోహ్లీని వీడితే.. తిరిగి జులై 14న బబుల్‌లోకి ప్రవేశించనుంది. ఈ మూడు వారాల పాటు భారత బృందం.. యూకేలో హాలీడేని ఎంజాయ్ చేయనున్నారు. అయితే వారు ఎక్కడ ఉంటారనేది వారి వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పిందిఅయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జట్టు సభ్యులంతా జులై 14న తిరిగి భారత క్యాంప్‌లోకి అడుగుపెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

నాలుగున్నర నెల‌ల పాటు సాగే సుదీర్ఘ ప‌ర్యట‌న‌ కావడంతో ఆటగాళ్లకు ఈ బ్రేక్‌ ఊరట కలిగించే అంశమని, ఈ సమయాన్ని క్రికెటర్లు కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు దోహదపడుతుందన్నారు.

- Advertisement -