- Advertisement -
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ ను నిన్న రాత్రి బంజారాహిల్స్ పోలిసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చెక్ బౌన్స్ కేసులో గత కొద్ది రోజులుగా తప్పించుకుతిరుగుతున్న ఆయన్ను నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కడపకు చెందిన మహేశ్తో వ్యాపార లావాదేవీలు కలిగిన బండ్ల గణేశ్.. 2014లో ఆయనకు రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉన్నది. ఈ మొత్తానికి సంబంధించి మూడు చెక్కులను బండ్ల గణేశ్ ఇచ్చారు.
జూబ్లీహిల్స్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాం కుకు చెందిన ఈ చెక్కులను 2017లో కడపలోని హెచ్డీఎఫ్ బ్యాంకులో మహేశ్ వేశారు. అప్పటికే ఈ చెక్కులను స్టాప్ పేమెం ట్ చేయించిన గణేశ్.. మహేశ్కు డబ్బులు ఇవ్వలేదు. దీంతో కడపలో కేసు నమోదైంది. దీంతో నేడు ఆయన్ను కడప కోర్టులో హాజరు పరిచారు. కడప కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. నవంబర్ 4 వరకూ ఆయన రిమాండ్ కొనసాగనుంది.
- Advertisement -