మెగా హీరోను అభినందించిన బాలయ్య..

148
- Advertisement -

వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ కొత్త దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన సినిమా ‘ఉప్పెన’. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ కాగా, తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషించారు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం ప్రసంశలతో పాటు కమర్షియల్ విజయం కూడా అందుకుంది. వారం రోజుల్లోనే 70 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. టాలీవుడ్‌లో పలువురు ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ఆదివారం హైదరాబాద్‌లో ‘ఉప్పెన’ చిత్రాన్ని వీక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆస్వాదించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ నటీనటులు, దర్శకుడు, ఇతర టెక్నీషియన్లు, నిర్మాతలను అభినందించారు. వైష్ణవ్ తేజ్ తొలి సినిమా అయినా కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా అనుభవం ఉన్న నటుడిలా కనిపించాడని ప్రశంసించాడు బాలయ్య.

- Advertisement -