కొనసాగుతున్న ‘అఖండ’ జాతర..

186
- Advertisement -

నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన అఖండ సంచలన వసూళ్లతో బాక్సాఫీసస్‌ను షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద అఖండ జాతర కొనసాగుతోంది. బాలయ్య తన కెరీర్ లోనే తొలిసారిగా వంద కోట్ల వసూళ్లు సాధించారు. బోయపాటి, బాలకృష్ణ కాంబోలో వచ్చిన మూడో సినిమా అఖండకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో కలెక్షన్ల పరంగా సినిమా దూసుకెళ్తోంది. పది రోజుల్లోనే వంద కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

నైజాంలో రూ.16.50 కోట్లు, సీడెడ్ లో రూ.12.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.5.10 కోట్లు, గుంటూరులో రూ.3.96 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.3.39 కోట్లు, కృష్ణాలో రూ.2.99 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.2.80 కోట్లు, నెల్లూరులో రూ.2.15 కోట్ల వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా రూ.49.34 కోట్ల షేర్ వచ్చినట్టు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కర్ణాటకతో పాటు మిగతా రాష్ట్రాలు, ఓవర్సీస్ లో కలిపితే ఈ పది రోజుల్లో రూ.9.35 కోట్లు వచ్చాయి. మొత్తంగా రూ.58.74 కోట్ల షేర్ వచ్చింది. గ్రాస్ వసూళ్లు రూ.100 కోట్ల మార్కును దాటాయని అంటున్నారు. రెమ్యూనరేషన్స్ సహా సినిమాకు రూ.53 కోట్ల దాకా ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే విడుదలైన 8 రోజులకే సినిమా వసూళ్లలో బ్రేక్ ఈవెన్ ను దాటేసింది.

- Advertisement -