టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు…

268
bakkami narasimhulu
- Advertisement -

తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడిగా బ‌క్క‌ని న‌ర్సింహులు నియమితులయ్యారు. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతోన్న న‌ర్సింహులును టీటీడీపీ చీఫ్‌గా నియమించారు చంద్రబాబు. 1994లో షాద్‌న‌గ‌ర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు బ‌క్క‌ని న‌ర్సింహులు. కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ మంత్రి శంక‌ర్ రావుపై విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఎల్ ర‌మ‌ణ టీఆర్ఎస్ పార్టీలో చేర‌డంతో టీటీడీపీ నేతలతో సమాలోచనల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు.

- Advertisement -