గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న బ్యాడ్మింటన్ క్రీడాకారులు

169
green
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా భారత క్రికెటర్ హనుమ విహారి విసిరిన చాలెంజ్ స్వీకరించి శంకర్ పల్లి మోకీల వద్ద తమ నివాసంలో మొక్కలు నాటారు బ్యాడ్మింటన్ క్రీడాకారులు క్రిష్ణ ప్రియ,తరుణ్ కోన.

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని క్రిష్ణ ప్రియ,తరుణ్ అన్నారు.పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కృష్ణప్రియ,తరుణ్ పిలుపునిచ్చారు.

అనంతరం ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా క్రిష్ణ ప్రియ కాంటినేంటల్ హాస్పిటల్ ఫౌండర్ డా.గురునాథ్ రెడ్డి,డైరెక్టర్ డా.రఘునాథరెడ్డి ఇద్దరికి చాలెంజ్ విసిరారు.మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు తరుణ్ కోన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి ప్రణీత్ కి చాలెంజ్ విసిరారు..

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ,కృష్ణప్రియ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని కృష్ణప్రియ కుదరవల్లి కి,తరుణ్ కోన కి అందజేశారు..

- Advertisement -