అయోధ్య విరాళాల చోరీతో వడ్డీ వ్యాపారం!

1
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైన అయోధ్య బాలరాముడి మందిరంలో భారీ కుంభకోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన విరాళాల సొమ్మును కొందరు కేటుగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా చోరీ చేశారు. అంతటితో ఆగకుండా ఆ పవిత్రమైన సొమ్మును వడ్డీ వ్యాపారాలకు, షేర్ మార్కెట్ పెట్టుబడులకు మళ్లించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సంచలన విషయాలను గుర్తించారు.

ఈ విరాళాల చోరీ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న అన్‌కల్ప్ మిశ్ర, లవ్‌కుష్ మిశ్ర, కరుణేష్ పాండేల నివాసాలపై ఎస్ఐటీ (SIT) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిందితుల ఇళ్లలో గుట్టలుగా దాచిన నోట్ల కట్టలు, భారీ ఎత్తున బంగారు ఆభరణాలు మరియు ఒక విలాసవంతమైన కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

లక్షలాది మంది భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్వాహా చేసిన ఈ డబ్బుతో నిందితులు సమాంతరంగా పెద్ద ఎత్తున వడ్డీ వ్యాపారం నడుపుతున్నట్లు విచారణలో తేలింది. అలాగే, ఈ అక్రమ సొమ్మును షేర్ మార్కెట్లలో భారీగా పెట్టుబడులుగా పెట్టి లాభాలు గడించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు.

ఈ కుంభకోణం నెట్‌వర్క్ చాలా పెద్దదని భావిస్తున్న అధికారులు, నిందితుల బంధువుల బ్యాంక్ ఖాతాలపై కూడా దృష్టి సారించారు. నిందితులకు చెందిన పలువురు బంధువుల బ్యాంకు ఖాతాల్లోకి హఠాత్తుగా భారీ మొత్తంలో నగదు జమైనట్లు దర్యాప్తులో స్పష్టమైంది. దీనితో అప్రమత్తమైన అధికారులు తక్షణ చర్యగా నిందితులు మరియు వారి బంధువులకు చెందిన దాదాపు 30 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసి (సీజ్ చేసి) జప్తు చేశారు.

Also Read:కేసీఆర్‌ని కలిసిన రవిచంద్ర

- Advertisement -