మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మోదీ

2
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా యువ క్రికెటర్లతో ముచ్చటించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఎంబీజీ (MCG) లో అడుగుపెట్టడం ఏ భారతీయుడికైనా ఒకేసారి రెండు రకాల భావోద్వేగాలను కలిగిస్తుంది. మొదటిది భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ఇచ్చే థ్రిల్…రెండవది మన రెండు దేశాలలో క్రికెట్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు, అదొక ఉమ్మడి అభిరుచి (ప్యాషన్) అనే గుర్తింపు. అయితే ఈ రోజు ఇక్కడ ‘లాస్ట్ ఓవర్ ఫినిష్’ ఒత్తిడి ఏమీ లేదు. బదులుగా ఆట యొక్క ఆనందం, మన స్నేహపూర్వక వాతావరణం మరియు కాబోయే ఛాంపియన్ల ఉత్సాహం మాత్రమే ఉన్నాయి అన్నారు.

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ సందర్శనలో భాగంగా ప్రధాని మోదీ ‘ఇండియా-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్‌మ్యాప్’ను ప్రకటించారు. మోదీ మాట్లాడుతూ ‘ఇండియా-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్‌మ్యాప్’ను ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చొరవ ద్వారా మేము కేవలం క్రికెట్ లోనే కాకుండా ఇతర క్రీడలలో కూడా సహకారాన్ని బలోపేతం చేస్తాము. క్రీడా శిక్షణ (స్పోర్ట్స్ ట్రైనింగ్), స్పోర్ట్స్ సైన్స్ మరియు టెక్నాలజీ వంటి రంగాలలో మేము కలిసి ముందుకు సాగుతాము, మైదానంలోనూ మరియు వెలుపల కూడా మా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటాము… అని పేర్కొన్నారు.

మోదీ మాట్లాడుతూ…నా స్నేహితుడు, ప్రధానమంత్రి ఆల్బనీస్‌ను కలిసే అవకాశం వచ్చినప్పుడల్లా, క్రికెట్ మా మధ్య ఒక సహజమైన అనుసంధాన బిందువుగా పనిచేసింది. మేము అహ్మదాబాద్‌లోని స్టేడియాన్ని కలిసి సందర్శించాము, ఈ రోజు ఇక్కడ ఉండటం వల్ల నేను నిజంగా క్రీడా స్ఫూర్తిని అనుభవించగలుగుతున్నాను — ముఖ్యంగా స్టీవ్ వా మరియు లిసా స్థాలేకర్ వంటి దిగ్గజాలు మన మధ్య ఉండటం సంతోషంగా ఉంది అన్నారు.

Also Read:కేసీఆర్‌ని కలిసిన రవిచంద్ర

- Advertisement -