రామమందిరం భూమిపూజ వాయిదా..!

324
ayodhya ram mandir
- Advertisement -

ఓ వైపు కరోనా మరోవైపు చైనా-భారత్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్ధితులు ఈ నేపథ్యంలో అయోధ్యలో రామమందిరం భూమి పూజ వాయిదా పడింది.డ్యూల్ ప్రకారం జూలై 1న రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగాల్సి ఉంది.

విశాఖ నక్షత్రంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆలయ నిర్మాణానికి భూమిపూజతో పాటు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్న కాటేజీలు, ఇతర వసతుల నిర్మాణ పనులను ప్రారంభించాలని భావించారు.

అయితే కరోనా, చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్న నేపథ్యంలో భూమిపూజ వాయిదా పడింది. కొత్త తేదీ ఎప్పుడూ ప్రకటిస్తారో తెలియాల్సి ఉంది.అయోధ్యలోని మంజా గ్రామంలో సరయూ నది ఒడ్డున 251 మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని యోగీ సర్కారు సంకల్పించిన సంగతి తెలిసిందే.

- Advertisement -