ముగిసిన 3వ రోజు ఆట.. ఆసీస్ 54 పరుగుల ఆధిక్యం..

174
India vs Australia
- Advertisement -

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట చివరకు ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 22 బంతుల్లో 3 బౌండరీల సాయంతో 20 పరుగులు చేయగా, మరో ఓపెనర్ మార్కస్ హారిస్ 14 బంతులాడి 1 పరుగు సాధించాడు. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 54 పరుగులకు చేరింది. ఆటకు ఇంకా రెండ్రోజుల సమయం మిగిలుండడంతో ఫలితం ఆసక్తికరంగా ఉండే అవకాశాలున్నాయి. అంతకుముందు, ఓవర్ నైట్ స్కోరు 62/2తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 336 పరుగులకు ఆలౌట్ అయింది.

- Advertisement -